స్టార్డంపై షాకింగ్ కామెంట్స్ చేసిన బుట్ట బొమ్మ..!!

-

బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అలవైకుంఠపురంలో సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుని, ఆ తర్వాత ఇటీవల ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ బుట్ట బొమ్మకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇక ఈమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నప్పటికీ కూడా ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అంటే అదృష్టమో లేక ఈమె నటన మెచ్చి దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తున్నారో తెలియదు కానీ వరుస అవకాశాలు అయితే అందుకుంటూ వెళ్తోంది.

ఇటీవల సైమా అవార్డు ఫంక్షన్లో రెండు అవార్డ్ లను కూడా సొంతం చేసుకుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించిన ఈమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డు వరించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే స్టార్డం గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియచేసింది. వాటి గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఈ రేంజ్ రావడానికి నేను ఎంతగా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇక ఈ స్థాయికి రావడం కోసం నా ఇష్టం కూడా వదులుకున్నాను. ఫ్యామిలీకి దూరంగా గడిపాను.. నేనెప్పుడూ స్టార్ డం ను ఫీల్ కాలేదు. కానీ స్టార్ డంను నేను ఎప్పుడు తలకెక్కించుకోలేదు అంటూ పూజా హెగ్డే తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను నేల మీదే ఉన్నాను. గతంలో నన్ను ఐరన్ లెగ్ అన్న వాళ్ళు.. ఇప్పుడు నెంబర్ వన్ అంటున్నారు.. ఐరన్ లెగ్ అన్న సమయంలో ఎలా స్వీకరించానో.. నెంబర్ వన్ అన్న సమయంలో కూడా అలాగే స్వీకరించాను అంటూ ఆమె తెలిపింది. సినిమా రంగంలో స్టార్డం అనేది శాశ్వతం కాదు అని అందువల్ల స్టార్డం గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు అని కూడా ఆమె వెల్లడించింది. ఇక సినిమాలలో బాగా నటించకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా సరే బోల్తా పడాల్సిందే అంటూ కూడా వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈమె త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news