భాగ‌మ‌తి బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా…డైరెక్ట‌ర్  ఖాళీ?

-

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో జి.అశోక్ తెర‌కెక్కించిన భాగ‌మ‌తి ఎలాంటి విజ‌యం న‌మోదు చేసిందో తెలిసిందే. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను తెచ్చి పెట్టింది. అరుంధ‌తి త‌ర్వాత అలాంటి హిట్ కోసం బొమ్మాళ్లి ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోంది. ఈ క్ర‌మంలో చాలా ప్ర‌య‌త్నాలు చేసిందిగానీ ఫ‌లించ‌లేదు. చివ‌రికి అశోక్ రూపంలో బ‌డా హిట్ ఖాతాలో వేసుకుంది. అయితే అశోక్ కెరీర్ మాత్రం ఎక్క‌డి వేసి గొంగ‌డి అక్క‌డే  ఉద‌నిపిస్తోంది. పిల్ల జ‌మీందార్ హిట్ తో లైమ్ లైట్ లోకి వ‌చ్చిన అశోక్ త‌ర్వాత రెండు సినిమాల‌తో ప‌రాజ‌యాలు ఎదురుచూసాడు. ఆ క్ర‌మంలో చాలా గ్యాప్ తీసుకుని భాగ‌మ‌తి క‌థ సిద్దం చేసి అనుష్క‌ను క‌న్వెన్ చేసి సినిమా తీశాడు.

అప్ప‌టికే అనుష్క బాహుబ‌లి రెండు భాగాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు  అందుకుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఉత్త‌రాదిన ప్ర‌త్యేకమైన గుర్తింపు ల‌భించింది. ఈ నేప‌థ్యంలో భాగ‌మ‌తి సినిమా విష‌యంలో అశోక్ పై ఒత్తిడి పెరిగింది. ఎట్టి ప‌రిస్థితుల్లో హిట్ కొట్టాల్సిన స‌న్నివేశం ఎదురైంది. చివ‌రికి అనుష్క ఇమేజ్ ను ఏ మాత్రం డ్యామేజ్ చేయ‌కుండా అనుకున్న విజ‌యాన్ని అందించాడు. అయితే ఆ సినిమా హిట్ ద‌గ్గ‌ర నుంచి అశోక్ వైపు ఏ హీరోగానీ, నిర్మాత‌గాని చూసినట్లు లేదు.  భాగ‌మ‌తి రిలీజ్ అయి ఏడాదిన్న ద‌గ్గ‌ర అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. ఒక‌వేళ క‌థ‌పై వ‌ర్క్ చేసినా ఆరు మాసాల‌కు మించి స‌మ‌యం ప‌ట్టదు.

అశోక్ మ‌రీ ఇంత గ్యాప్ తీసుకున్నాడంటే క‌చ్చితంగా  నిర్మాత కోస‌మే వెయిట్  చేస్తున్నాడ‌ని కొంద‌రంటున్నారు. అశోక్ వ‌ద్ద స్టార్ హీరోల‌కు త‌గ్గ క‌థ‌లు లేక‌పోవ‌డంతో యంగ్ హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి మొగ్గు చూపుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఓ యువ హీరోని లైన్ లో పెట్టిన‌ట్లు  తెలిసింది. స్టోరీ లాక్ అయిందిట‌. నిర్మాత కోసం వెయిట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news