మోస్ట్ అవెయిటెడ్ ‘భామాకలాపం 2’ గ్లింప్స్ రిలీజ్

-

టాలీవుడ్ బ్యూటీ ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్లో జోరు సాగిస్తోంది. ఈ భామ డిజిటల్ ప్లాట్ఫామ్పై తన సత్తా చాటుతోంది. గతంలో ఆహా ఓటీటీలో ‘భామాకలాపం’ సినిమాతో ప్రియమణి సూపర్ సక్సెస్ను అందుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్గా ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు విపరీతంగా ఫిదా అయ్యారు. ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ పార్ట్-2 తెరకెక్కించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో అభిమన్యు తాడిమేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సీక్వెల్కు సంబంధించి తాజాగా మేకర్స్ చిన్న గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రియమణి, శరణ్య మధ్య సస్పెన్స్ డైలాగ్స్ పార్ట్-2పైన అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రాన్ని బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీరత్‌ కపూర్‌, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ గ్లింప్స్లో ప్రియమణి, శరణ్య ఇద్దరూ ఏదో ఇల్లీగల్ పని చేయడానికి వెళ్తున్నట్లుగా కనిపించారు. ‘చెరో 25 లక్షలు. ఇద్దరికి కలిపి 50 లక్షలు. ఎన్ని ఇడ్లీలు అమ్మితే అంత డబ్బు వస్తుంది’ అని శరణ్య చెప్పే డైలాగ్తో గ్లింప్స్ ప్రారంభమైంది. ‘మనం చేస్తుంది కరెక్టేనా’ అని ప్రియమణి అడగ్గా – ‘అసలు ఇది మొదలు పెట్టిందే మీరు. మీరు మాములు వైఫా – డేంజరస్ వైఫ్’ అని శరణ్య చెప్పడం క్యూరియాసిటినీ పెంచింది.

Read more RELATED
Recommended to you

Latest news