Bheemla Nayak: పవర్ అభిమానులకు పూనకాలే.. కొత్త ట్రైలర్ విడుదల

-

ప‌వ‌ర్ పుల్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి రానాలు న‌టించిన భీమ్లానాయ‌క్ ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఏంటీ బాలాజీ స్పీడ్ పెంచావు. ఇది పులులు తిరిగే ప్రాంత‌మ‌ట బాబూ.. పులి పెగ్గేసి ప‌డుకుంది కానీ నువ్వు స్లోగానే పోనీ అనే రానా డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. నేను ఇవ‌త‌ల ఉంటేనే చ‌ట్టం. అవ‌త‌ల కొస్తే క‌ష్టం. వాడికి అంటూ న ప‌వ‌న్ చెప్పే డైలాగ్‌తో ముగుస్తుంది. వాస్త‌వానికి ప్రీ రిలీజ్ ఈ ట్రైల‌ర్ విడుద‌ల చేయాలి. కానీ ప్రీ రిలీజ్ వాయిదా ప‌డ‌డంతో ఈ ట్రైల‌ర్‌ను ముందే విడుద‌ల చేశారు.

తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ భీమ్లానాయ‌క్ కొత్త ట్రైల‌ర్‌గా ఆవిష్క‌రించారు. తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ సీన్లు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ట్రైల‌ర్ సినిమా హైప్‌ను పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎవ‌డాడు ఏమ‌న్నా దిగొచ్చాడా.. ఆప్ట‌ల్ ఎస్సై అని రానా ఆవేశంతో చెప్పే డైలాగ్ అద్భుత‌మ‌నే చెప్పాలి. ఎవ‌రినీ అరెస్ట్ చేశావా తెలుసా నీకు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ రామ‌స్వామి రాయ‌వయ్య ఎఫ్ఐఆర్‌, వీడు బ‌లిసి కొట్టుకుంటున్నాడు. మ‌న‌మేమిటో వీడికి చూపిద్దాం అని డైలాగ్ ప‌వ‌న్ అభిమానుల‌కు ఉత్సాహాన్ని ఇస్తుంది. అహంకారానికి ఆత్మ‌గౌర‌వానికి మ‌డ‌మ‌తిప్ప‌ని యుద్ధం అంటూ వ‌చ్చే డైలాగ్. అదేవిధంగా నిత్యా మీన‌న్ కూడా నాయ‌క్ పెళ్లాం అంటే నాయ‌క్‌లో స‌గం కాదు.. నాయ‌క్‌లో డ‌బుల్ అనే డైలాగ్ చెప్ప‌డం విశేషం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌-రానా మ‌ధ్య యాక్ష‌న్ స‌న్నివేశాలు అద్బుత‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ట్రైల‌ర్ ఈ విధంగా ఉంటే ఇక సినిమా ఏవిధంగా ఉంటుందోన‌ని అభిమానులు పేర్కొంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news