Big Boss Non Stop: ఈ సారి సింగిల్ కాదు డబుల్ ఎలిమినేషన్..టెన్షన్‌లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్

-

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో ఆరోవారం రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉండబోతున్నదనే టెన్షన్ కంటెస్టెంట్స్ తో పాటు బీబీ లవర్స్ కు ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోల్లో నాగార్జున చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ పంచులు వేసే నాగార్జున ఈ సారి రూటు మార్చారు.

కంటెస్టెంట్స్ యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ పై ఫైర్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు యాంకర్ శివకు వారం రోజుల పాటు కఠినమైన పనిష్ మెంట్ కూడా ఇచ్చారు. ఇక నామినేషన్ లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో? అన్న చర్చను నాగార్జునే స్టార్ట్ చేశారు.

ఈ సారి సింగిల్ కాకుండా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నదని పేర్కొన్నారు. దాంతో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరా? అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా షురూ అయింది. నాగార్జున వ్యాఖ్యలతో బిగ్ బాస్ ఇంటి సభ్యులలో టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ముమైత్ ఖాన్, శ్రవంతిలే అని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

వారిరువురే ఈ వారం ఎలిమినేట్ అవుతారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ అందరికంటే వరస్ట్ పొజిషన్ లో ఉందని, ఆమె కంటే కొంచెం బెటర్ గా శ్రవంతి ఉందని, అలా వారిరువురు డేంజర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి.. ‘బిగ్ బాస్’ ఏ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారో..

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news