బిగ్ బాస్: బంధాలని తెంచేసిన నాగార్జున.. ఈ సారైనా ఆటని రక్తి కట్టిస్తారా..?

-

బిగ్ బాస్ లో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అందరి బంధాలని విడగొట్టాడు. ఆటలో ముందుకు వెళ్ళనీయకుండా ఏ బంధం ఆపుతుందో దాన్ని విరిచెయ్యమని కోరాడు. వారం వారం కంటెస్టెంట్ల ఆటతీరుని సమీక్షిస్తూ, వీలైనప్పుడల్ల క్లాస్ పీకుతూ, హెచ్చరిస్తూ ఉండే నాగార్జున, ఈ సారి కూడా ఒక్కొక్కరి బాధలని కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ విన్నాడు. అందరిలోకి ముఖ్యంగా అవినాష్, తన బాధ చెప్పుకున్నాడు.

మోనాల్ తన్నిందని అవినాష్ చెప్పడంతో, ఆమె కావాలనే తన్నిందా లేదా అన్న విషయాన్ని అప్పటి వీడియో చూపించి మరీ మిగతా కంటెస్టెంట్స్ అందరితో కావాలనే తన్నిందన్నట్టుగా చెప్పించాడు. గత వారం అభిజిత్, హారికలకి క్లాస్ పీకడంతో పర్సనల్ టార్గెట్ చేసారంటూ విమర్శలు రావడంతో ఈ సారి కంటెస్టెంట్స్ చేతనే చెప్పించినట్టుగా తెలుస్తుంది. మోనాల్ తప్పు చేసిందన్న విషయమై ఎక్కువ చర్చ జరపకపోవడమే అందుకు నిదర్శనంగా అనిపిస్తుంది.

అదంతా అటుంచితే శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో తమ తమ ర్యాంకులు ఎంచుకోమని చెప్పగా అందరూ ఇక్కడ దాకా వచ్చిన మాకు ర్యాంకులు అవసరమా అంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుని చప్పగా కానించేసారు. దాంతో బంధాలు గేమ్ ని ముందుకు తీసుకువెళ్ళకుండా ఆపుతున్నాయని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం, ఆ బంధాలని తెంచేసుకోమని చెప్పింది. ఒక్కొక్కరు ఒక్కొక్కరితో బంధం తెంచేసుకున్నారు. అవినాష్, సోహైల్ మాత్రం అందరితో బంధం తెంచుకున్నారు. మరి బంధాలని తెంచేసిన బిగ్ బాస్, ఆటని ఏ విధంగా మలుపు తిప్పబోతున్నాడన్నదే ఆసక్తిగా ఉంది. అదీగాక ఈ వారం హౌస్ నుండి ఎవరు వెళతారనే విషయమై అందరిలో చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news