బిగ్ బాస్: మొదట్లో లొల్లి పెట్టి చివర్లో బూస్ట్ తాగించాడుగా..!

-

బిగ్ బాస్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరినీ జంటలుగా విడదీసి, ఒక్కో జంటకి ఒక్కో ట్యాగ్ ఇస్తూ పోయారు. ఆ విధంగా అఖిల్, మానాల్ జంటలకి అహంకారుల జంటగా రాగా, సోహైల్, మెహబూబ్.. ఇద్దరికీ అబద్ధాల కోరు జంటగా ఇచ్చారు. ఐతే తానేం అబద్ధాలు చెప్పానని, అలా ఎందుకు ఇచ్చావని అఖిల్ తో సోహైల్ గొడవ పెట్టుకున్నాడు. ఆ ట్యాగ్ ఇచ్చేటపుడు అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు మాత్రమే చెప్తాడని చెప్పిన అఖిల్, సోహైల్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు.

ఈ విషయమై వీరిద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. చివరికి అఖిల్ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేయడంతో సోహైల్ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ఎంత ఈజీగా జరుగుతాయో, ఎంత ఈజీగా కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టగలడో బిగ్ బాస్ మరోసారి నిరూపించాడు.

ఇప్పటివరకూ బిగ్ బాస్ మొదలై యాభై ఐదు రోజులైన కారణంగా ఈ యాభై ఐదు రోజుల ప్రయాణాన్ని వీడియో రూపంలో కంటెస్టెంట్స్ అందరికీ చూపెట్టాడు. హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి స్నేహం చేసుకోవడం, గొడవపడటం, ఏడుపులు, కన్నీళ్ళు, కోపాలు.. అన్నీ కలిపి ఉన్న వీడియో కంటెస్టెంట్స్ అందరికీ తమ గతాన్ని గుర్తు చేసింది. అది హౌస్ మేట్స్ కి మరింత బూస్ట్ అప్ ఇచ్చింది. ఇకపోతే రేపే ఎలిమినేషన్. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో హౌస్ నుండి ఎవరు బయటకి వెళ్ళిపోతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news