బిగ్ బాస్ 6: కావాలనే ఈ వారం వీరిని ఎలిమినేట్ చేశారా..?

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఆరవ సీజన్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెండో వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్ తీసేసి రెండో వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టేశారు.దీంతో ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పవచ్చు. నిజానికి సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నామినేషన్ లో 8 మంది ఉంటే వారిలో 5 మంది డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక ఇందులో గీతు రాయల్, ఆదిరెడ్డి , షాని, అభినయశ్రీ ఇంకా రాజశేఖర్ ఉన్నారు. ఇకపోతే కెప్టెన్ గా రాజశేఖర్ ఉండడం కారణంగా లాస్ట్ రెండు రోజుల నుంచి మంచి ఓటింగ్ ను కైవసం చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

అభినయశ్రీ పూర్తిగా ఆటలో వెనుకబడిపోయింది. సిసింద్రీ టాస్క్ లో కూడా బొమ్మని కాపాడుకోలేకపోయింది . ఇక దీంతో ఛాలెంజ్ ఎదుర్కో లేకపోయిన ఈమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక అలాగే షానీ కూడా ఆటలో గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయారు. వచ్చిన ఐస్ క్రీమ్ చాలెంజ్ ను సరిగ్గా టైం కి పెట్టలేకపోయాడు. దీంతో ఓటింగ్ కాస్త తగ్గింది. ఆదిరెడ్డి కూడా టాస్కులో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేదు.. కానీ సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వల్ల కొద్దిగా బయటపడ్డాడని చెప్పవచ్చు. ఇక ఆది, గీతూ ఇద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. గీతూ కూడా సిసింద్రీ టాస్కులో ఇరగదీసింది. అందరి బొమ్మలను దాచేసి పాటలో దూసుకు వెళ్ళింది. అయితే ఇప్పుడు షానీ, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇక మూడో వారం అలాగే నాలుగో వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇద్దరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి రెండోవారమే డబుల్ ఎలిమినేషన్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఏది ఏమైనా అభినయశ్రీ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఇక రెండోవారం టాస్క్ లో కూడా వెనుకబడింది. అలాగే షానీ కూడా పెద్దగా పెర్ఫార్మన్స్ చేయకపోవడం వల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news