Bigg Boss Telugu 5: బిగ్ బాస్ కు లంచం.. రూమ‌ర్ల పై జెస్సీ క్లారిటీ

-

బిగ్ బాస్ సిజ‌న్ 5 కి మోడ‌ల్ జెశ్వంత్ లంచం ఇచ్చి వెళ్లాడ‌నే రూమ‌ర్లు ఈ మ‌ధ్య కాలం లో ఎక్కువ గా వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ హౌస్ లో కి నటీ న‌టులు, క‌మెడియ‌న్స్, యూట్యూబర్స్ సింగ‌ర్స్, కొరియో గ్రాఫ‌ర్స్ ఎక్కువ గా వ‌చ్చారు. కానీ ఈ సిజ‌న్ 5 లో మోడ‌ల్ రావ‌డం ప‌ట్ల మొద‌టి నుంచే ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేశారు. తాజా గా ఈ రూమ‌ర్లు ఎక్కువ గా వ‌స్తున్నాయి. మోడ‌ల్ జెశ్వంత్ బిగ్ బాస్ యాజ‌మాన్యానికి ఎదురు డ‌బ్బులు ఇచ్చి హౌస్ లో కి వెళ్లాడ‌ని నెట్టింట్లో రూమ‌ర్స్ వ‌స్తున్నాయి.

దీని పై ఎట్టకేల‌కు బిగ్ బాస్ సిజ‌న్ 5 కంటెస్టెంట్ మోడ‌ల్ జెస్సీ క్లారిటీ ఇచ్చాడు. తాను బిగ్ బాస్ కు డ‌బ్బులు ఇవ్వ‌డం ఎమిటి అని ప్ర‌శ్నించాడు. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు త‌న అకౌంట్ లో కేవ‌లం రూ. 11 వేలు ఉన్నాయ‌ని తెలిపారు. తాను మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వ‌చ్చాను. లంచం ఇచ్చేంత స్థోమ‌త త‌న కుటుంబానికి లేద‌ని జెస్సీ వివ‌రించాడు. అలాగే త‌న‌కు తండ్రి లేడ‌ని.. రాత్రి ఉద్యోగం చేస్తూ మోడ‌లింగ్ నేర్చుకున్నాని తెలిపాడు. నిజానికి బిగ్ బాస్ నుంచి ఫ్రీ ఆఫ‌ర్ వ‌చ్చినా.. తాను వెళ్లే వాడిని అని తెలిపాడు. కానీ వాళ్లే త‌న‌కు డ‌బ్బులు ఇచ్చార‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news