ఏపీలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం…!

-

ఏపీ లో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేగింది. గుంటూరు జిల్లా మంగళగిరి లో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థులు నిన్న ఉదయం స్కూల్లో బ్యాగులు పెట్టి బయటకు వెళ్లారు. టీచర్లకు చెప్పకుండా వెళ్లడం తో అనంతరం తిరిగి పాఠశాలకు రాగా ఈ విషయంపై మీ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామంటూ విద్యార్థులను ఉపాధ్యాయులను హెచ్చరించారు.

దాంతో తల్లిదండ్రులకు విషయం తెలిస్తే కొడతారన్న భయంతో విద్యార్థులు అదృశ్యమయ్యారు. పారిపోయిన వారిలో ప్రభుదేవా, వెంకట్, సంతోష్, వెంకీ లు ఉన్నారు. ఈ ఘటన పై ఇప్పటికే తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో వెతికినప్పటికి ఆచూకీ లభించలేదని తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news