Bigg Boss 5 Telugu: జెస్సి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే..!

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ గేమ్ మరింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఎప్పుడూ లేని విధంగా 19 మందితో ప్రారంభ‌మైనా.. ఈ సీజ‌న్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 10 మంది ఎలిమినేట్ అయ్యారు. తాజాగా హౌస్ నుంచి అనారోగ్యం తో బ‌య‌ట‌కు వెళ్లిన కంటెస్టెంట్ జెస్సీ.

విజయవాడకు చెందిన జశ్వంత్ ప‌డాల‌( జేస్సీ) మోడల్‌గా, యాక్టర్‌గా రాణిస్తూ బిగ్‌బాస్ హౌస్ లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి రెండు వారాల్లో స్వాతి ముత్యంలో క‌మ‌ల్ హాస‌న్ లా కనిపించాడు. చిన్న పిల్లాడి తరహాలో హౌస్లో గేమ్ ఆడారు. అస‌లు ఎందుకు తీసుకున్నార్రా బాబు అనే విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. కానీ.. మూడో వారం నుంచి త‌న గేమ్ ప్లాన్ మొత్తం మార్చేశాడు. త‌న‌లోన రొమాంటిక్ యాంగిల్ బ‌య‌ట పెట్టాడు. త‌న గేమ్ లో యూత్ ను అట్రాక్ట్ చేశాడు.

ఈ క్ర‌మంలో షణ్ముఖ్ జస్వంత్, సిరి, జేస్సీ స్నేహం ఓ రేంజ్ కు వెళ్లింది. హౌస్ లో ఎంత మంది గొడ‌వ‌లు ప‌డ్డ వీరు మాత్రం ఎప్పుడూ క‌లిసే గేమ్ ఆడే వారు. త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఇలా పది వారాల పాటు హౌస్ లో కొనసాగిన జెస్సి ఎవరు ఊహించని విధంగా అనారోగ్య కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఒప్పందం ప్ర‌కారం వారానికి 1.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంటే ప‌ది వారాల‌కు గానూ మొత్తం 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం జెస్సీ కాచిగూడలోని టీఎక్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news