BREAKING: నటుడు శరత్ బాబు కన్నుమూత

-

టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయన మరణాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. నెల రోజులకు పైగా హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నేడు పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందారు.

మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 1951 జులై 31న శ్రీకాకుళం లోని ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు 250 కి పైగా చిత్రాలలో నటించారు. శరత్ బాబు చివరగా “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో నటించారు. ఇక ఆయన భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించేందుకు సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news