జగన్ టికెట్ ఇస్తే పోటీ చేస్తా – పేర్ని కిట్టు

-

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మచిలీపట్నం సభలో మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో తనకు ఇదే చివరి మీటింగ్ అని మాట్లాడారు. మరోసారి జగన్ తో వేదికను పంచుకునే అవకాశం వస్తుందో రాదో అని వ్యాఖ్యానించారు. పాలిటిక్స్ నుండి రిటైర్ అవుతున్నానని వేదికపైనే ప్రకటించారు నాని.

కాగా వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని.. తన వారసుడిని పోటీకి దింపుతానని ఇప్పటికే పేర్ని నాని పలుమార్లు క్లారిటీ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వారసుడు కృష్ణమూర్తి (కిట్టు) వచ్చే ఎన్నికలలో పోటీపై స్పందించారు. సీఎం జగన్ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మరి జగన్ కిట్టుకి అవకాశం ఇస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news