బన్నీ సినిమా భారీ వసూళ్ల కోసం.. భ‌లే ప్లాన్ చేశారే..

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడం గతంలో వచ్చిన రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ సినిమాని సంక్రాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకున్న బ్లూ స్కై సినిమాస్ వారు అక్కడ అత్యధిక స్క్రీన్లపై విడుదల చేయనున్నారు.

ఇక‌ ఇటీవల కాలంలో థియేటర్స్ లో సినిమా ఉన్నప్పటికీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనే చూడటానికి అక్కడ అంతా అలవాటు పడిపోయిన కారణంగా, థియేటర్స్ వైపు నుంచి వచ్చే వసూళ్లు పడిపోయాయి. అందువలన ‘అల వైకుంఠపురములో’ థియేటర్స్ లో ఉన్నంతవరకూ అమెజాన్ ప్రైమ్ లో గానీ .. నెట్ ఫ్లిక్స్ లో చూసే అవకాశం ఉండదు అంటూ బ్లూ స్కై సినిమాస్ వారు ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ నిర్ణయం కారణంగా ఓవర్సీస్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news