మెగాస్టార్‌తో భాగమతి

-

మెగాస్టార్ అభిమానులకు తీపి కబురు. ‘సైరా’ తర్వాత చిరంజీవి చేయబోయే చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఇది కూడా రాంచరణ్ బ్యానర్ లోనే ఉండేట్టు ఉంది. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సినిమాలో కథానాయికగా మన దేవసేన అనుష్క మెగాస్టార్ సరసన నటించనుంది. కొరటాలకు బాగా ఇష్టమైన సామాజిక-సందేశాత్మక ఇతివృత్తంతోనే ఉండబోతున్న ఈ కథ చిరంజీవిని కూడా బాగా ఇంప్రెస్ చేసిందని తెలిసింది. హీరోయిన్ బాగా పరిణితి చెందిన అమ్మాయి పాత్ర కావడంతో కొరటాల తన ‘మిర్చి ‘ నాయిక అనుష్కను సంప్రదించగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పిందట.
కాగా, ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, 2019 ఆరంభంలో గానీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ‘సైరా’ షూటింగ్ పూర్తవడాన్ని బట్టి కొత్త సినిమా ప్రారంభం ఉంటుంది.

భాగమతి తర్వాత తమిళంలో ఓ సినిమా చేస్తున్న అనుష్క తెలుగులో ఏ సినిమా కన్ఫాం చేయలేదు. ఇంతకు ముందు చిరంజీవి సరసన ‘స్టాలిన్’లో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసిన అనుష్కకు ఇది అనుకోని బహుమతి. ‘భరత్ అనే నేను’  తర్వాత కొరటాల శివ చేయబోయే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news