త్రివిక్రమ్ ఔట్‌.. సుకుమార్ ఇన్.. గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన చిరంజీవి..!

-

సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరు రెండు విభిన్నమైన పాత్రలలలో కనిపించనున్నారని, అందులో ఒకటి నక్సలైట్ కాగా మరొకటి దేవాదాయ శాఖాలో పనిచేసే అధికారిగా కనిపించనునట్టు సమాచారం. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక‌ ఆ తరువాత సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టుగా సమాచారం. కొరటాల సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలని చిరంజీవి అనుకున్నారు.

అయితే కొరటాల సినిమా పూర్తయ్యేవరకూ వేచి ఉండటం వలన చాలా సమయం వృథా అవుతుందనే ఉద్దేశంతో, ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి త్రివిక్రమ్ సిద్ధమైపోయాడు. దాంతో తన తదుపరి సినిమాను సుకుమార్ తో చేయాలని చిరంజీవి భావించారు. ఈ విషయంపై చిరంజీవి – సుకుమార్ మధ్య కథా చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. సుకుమార్, చరణ్ కాంబినేషన్లోని ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ సినిమాకి కూడా నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు. కొరటాల సినిమాను చిరంజీవి పూర్తిచేసేలోగా, సుకుమార్ కూడా బన్నీ సినిమాను పూర్తిచేయవలసి ఉంటుంది. ఆ తరువాతే ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news