చరణ్ కోసం రంగంలోకి చిరు..!

-

మెగా తనయుడిగా రాం చరణ్ చేసే ప్రతి సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం ఉంటుంది. అయితే ఈమధ్య సొంత నిర్ణయాలతో కూడా మంచి ఫలితాలనే దక్కించుకుంటున్నాడు రాం చరణ్. రంగస్థలం సినిమాతో చరణ్ ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో అందరికి తెలిసిందే. ప్రస్తుతం రాం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. వినయ విధేయ రామ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి బరిలో జనవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజైన టీజర్, రెండు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న జరుగనుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్టు తెలుస్తుంది.

కొద్దిరోజులుగా వినయ విధేయ రామ ఈవెంట్ కు కె.టి.ఆర్, చరణ్ కూడా అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి మాత్రం కన్ ఫాం అవగా ఎన్.టి.ఆర్, కె.టి.ఆర్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version