టాలీవుడ్​లో మరో క్రేజీ మల్టీస్టారర్.. చిరు-శర్వా కాంబోలో మూవీ

-

టాలీవుడ్​లో మరో సూపర్ క్రేజీ కాంబో రెడీ అవుతోంది. ఇప్పటికే పలు మల్టీస్టారర్లు టాలీవుడ్​ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో మల్టీస్టారర్ కాంబో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ వాళ్లెవరంటే.. మెగాస్టార్ చిరంజీవి-యంగ్ హీరో శర్వానంద్. సెకండ్ ఇన్నింగ్స్​లో చిరు.. జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు. ఓ చిత్రం షూటింగ్​ దశలో ఉండగానే.. మరో మూవీని లైన్​లో పెడుతున్నారు.

తాజాగా చిరంజీవి మలయాళంలో సూపర్​ హిట్​ అయిన బ్రో డాడీ మూవీ రీమేక్​ చేసేందుకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత.. నిర్మించనున్నారు. మెగాస్టార్​కు జోడీగా త్రిష నటించనున్నారు. సుమారు 23 ఏళ్ల తర్వాత చిరంజీవితో త్రిష మళ్లీ జత కట్టనున్నారు. వీరిద్దరూ గతంలో స్టాలిన్ చిత్రంలో కలిసి నటించారు. అయితే ఈ సినిమాలో చిరంజీవి కుమారుడి పాత్ర కోసం శర్వానంద్‌‌ను ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్‌ వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు మరో అప్డేట్​ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శర్వానంద్​- చిరంజీవి.. తండ్రీకొడుకులు కాదట. అన్నదమ్ముళ్లుగా నటించనున్నారట. మాతృక చిత్రంలో ఇద్దరు హీరోలు తండ్రీ కొడుకులుగా కనిపిస్తే.. తెలుగులో మాత్రం ఇద్దరూ అన్నదమ్ముళ్లులా కనిపిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news