కేజీఎఫ్‌-2లో క్లైమాక్స్ అలా ఉంటుందా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

-

కేజీఎఫ్‌-2 గురించి సౌత్ ఇండియా ఎంత‌గా ఎదురు చూ‌స్తుందో అంద‌రికీ తెలిసిందే. కేజీఎఫ్‌-`1 ఎంత పెద్ద విజ‌యం స‌సాధించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిర‌గ‌రాసింది. ఒక‌రకంగా చెప్పాలంటే సినీ ప్ర‌పంచంలో ఓ ట్రెండ్ ‌సెట్ చేసింది. సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది. ప్ర‌స్తుతం య‌ష్ చాప్ట‌ర్ 2లో న‌టిస్తున్నాడు. ఐదు భాషల్లో జులై 16న కేజీఎఫ్-2 థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఛాప్టర్2 హక్కులు ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని స‌మాచారం. ఇక తెలుగులో ఛాప్టర్-1 రూ.13 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. కొద్ది రోజుల క్రితం రిలీజైన చాప్టర్‌-2 ట్రైల‌ర్ అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది.


అయితే చాప్ట‌ర్‌-2 యాంటీ క్లైమాక్స్ తో తెరకెక్కుతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇందులో య‌ష్ కు విల‌న్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ న‌టిస్తున్నాడు. వీరిద్ద‌రి మధ్య సన్నివేశాలను డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రాఖీభాయ్ పాత్ర క్లైమాక్స్ లో ప్రధాని పాత్ర పోషిస్తున్న రవీనా టండన్ సైన్యం చేతిలో ఓడిపోయి చ‌వ‌రికి చనిపోతాడ‌ని తెలుస్తోంది. డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్-2ను చాలా ఎమోషనల్ గా ముగించనున్న‌ట్టు స‌మాచారం. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం యష్‌ ధనవంతుడిగానే సినిమాలో చనిపోతారని తెలుస్తోంది. అయితే హీరో చనిపోతే సినిమాలు హిట్ట‌వ్వ‌డానికి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇంత‌కు ముందు కూడా ఇలాంటి క్లైమాక్స్ లో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. మ‌రి అలాంటి సెంటిమెంట్ ను కేజీఎఫ్2 బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news