బాలీవుడ్ హీరోయిన్ ఇషాగుప్తాకు క‌రోనా పాజిటివ్

-

సినిమా స్టార్స్ ను క‌రోనా వైర‌స్ విడిచిపెట్ట‌డం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషాల న‌టీన‌టులకు వ‌రుస‌గా క‌రోనా వైర‌స్ సోకుతుంది. బాలీవుడ్ లో ఇప్ప‌టికే అర్జున్ క‌పూర్, క‌రీనా క‌పూర్, నోరా ఫ‌తేహీ, శ‌న‌య క‌పూర్, మ‌దుర్ బండార్క‌ర్ తో పాటు ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజా గా బాలీవుడ్ హీరోయిన్ ఇషాగుప్తాకు కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఇషాగుప్తా అధికారికంగా సోషల్ మీడియాలో ప్ర‌క‌టించింది.

తాను క‌రోనా నిబంధ‌న‌లతో పాటు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న క‌రోనా సోకింద‌ని ఇషాగుప్తా తెలిపింది. ప్ర‌స్తుతం తాను ఇంట్లోనే హోం ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని తెలిపారు. అయితే త‌న‌కు స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియాలో తెలిపింది. కాగ త‌ను త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి కోలుకుంటాన‌ని తెలిపింది. అయితే క‌రోనా బారీన ప‌డ‌కుండా అంద‌రూ కూడా క‌రోనా నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాల‌ని సూచించింది. క‌రోనా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని.. అంద‌రూ కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఇషాగుప్తా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news