పుష్పకు కరోనా ఇబ్బందులు…!

-

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పుష్ప. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమా రాయలసీమలో చిత్తూరు జిల్లాలోని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో వస్తుంది. స్మగ్లర్ల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో సుకుమార్ కాస్త భయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఫైట్లు, ఛేజింగ్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాలని, విదేశీ టెక్నీషియన్ల సాయం తీసుకోవాలని భావించాడట. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. లాక్ డౌన్ తర్వాత విదేశాల నుంచి వారిని తీసుకొచ్చే అవకాశం దాదాపుగా లేదని అంటున్నారు.

విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ ని చెయ్యాలని అనుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక అడవుల్లో ఈ సినిమాను షూట్ చేసే అవకాశం ఉంద. ఇక అది కూడా సాధ్యం కాదు కాబట్టి సినిమా షూట్ ని చిత్తూరు అడవుల్లోనే పూర్తిగా తెరకేక్కిస్తారు అని అంటున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు ఆనుకుని అటవీ ప్రాంతాలు ఉన్నాయి శ్రీలంకలో. అక్కడ కూడా షూట్ చేసే అవకాశాలు కనపడటం లేదట.

Read more RELATED
Recommended to you

Latest news