బాలీవుడ్ స్టార్ హీరోకి కరోనా ప్రభావం…!

-

కరోనా దెబ్బకు ఇప్పుడు క్రికెట్, సినిమా, వ్యాపారాలు ఇలా అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. పలు సినిమాలు విడుదల వాయిదా పడగా మరికొన్ని సినిమాల షూటింగ్ ఆపేశారు. ఐపిఎల్ కి కూడా కరోనా దెబ్బ గట్టిగా తగిలింది. కరోనా దెబ్బకు అసలు ఐపిఎల్ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విదేశీ ఆటగాళ్ళకు భారత ప్రభుత్వం వీసాలను కూడా రద్దు చేయడం గమనార్హం.

తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కూడా కరోనా దెబ్బ తగిలింది. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో… అజయ్ దేవ్‌గణ్,రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం విడుదలను వాయిదా వేసారు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను వాయిదా వేసారు. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయాలనని భావించారు. కరోనా దెబ్బకు ఈ సినిమా వాయిదా వేసారు.

ఈ మేరకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ కీలక ప్రకటన విడుదల చేసింది. మరి కొన్ని సినిమాలను కూడా వాయిదా వేసే అవకాశాలు కనపడుతున్నాయి. వాటిల్లో అగ్ర హీరోల సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీనితో ఇప్పుడు అందరూ ఆందోళన వ్యక్త౦ చేస్తున్నారు. నిర్మాతలు అయితే వడ్డీలు కట్టాలని భయపడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో ఏమో.

Read more RELATED
Recommended to you

Latest news