‘ధమ్కీ’ సినిమాకు వెళ్తే ఆ మూవీ ప్రదర్శన.. షాక్ లో ప్రేక్షకులు

-

మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ప్రధాన పాత్రలో నటించిన కమర్షియల్ ‘దాస్‌ కా ధమ్కీ’. విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే, ఈ సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకులకు ఓ థియేటర్ షాక్ ఇచ్చింది. ధమ్కీ సినిమా బదులు మరో సినిమాను ప్రదర్శించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందంటే..

వైజాగ్ వేదికగా ధమ్కీ సినిమా ప్రదర్శనలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలోని సుకన్య థియేటర్‌లో ‘ధమ్కీ’కి బదులు ‘ధమాకా’ చిత్రాన్ని ప్రదర్శించారు.  ‘ధమాకా’ అనే టైటిల్‌ స్క్రీన్‌పై కనిపించగానే ప్రేక్షకులు గోల చేశారు. దీనిని గ్రహించిన థియేటర్‌ సిబ్బంది వెంటనే తప్పును సరిదిద్దుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా పేర్లు రెండూ కాస్త ఒకేలా ఉండటంతో ఈ విధమైన గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news