దిల్ రాజు సినిమా వారసుడు వాయిదానా ! ఎంత కష్టం వచ్చిందిరా నాయన.!

-

ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందు జనవరి 12 విడుదల కు ప్లాన్ చేశారు.ఏమాంటూ ఈ సినిమా మొదలు పెట్టారో గాని దిల్ రాజు చేతలు మాటలు అన్నీ వివాదాలకు దారితీస్తున్నాయి.

దిల్ రాజు వ్యాఖ్యల తో ఈ సినిమా పై ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ వల్ల బోలెడంత నెగిటివ్ ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు మరో న్యూస్ ఈ సినిమా విషయంలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పైగానే ఖర్చు పెట్టారు. రకరకాల కారణాలు వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు పులి మీద పుట్రా లా సినిమా వాయిదా పడింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా ఎందుకు లేట్ అవుతుంది అంటే తెలుగు రిలీజ్ కి సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాగా పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది.దీనితో అనుకున్న డేట్ కి సినిమా విడుదల అవుతుందో లేదో అనేది దిల్ రాజు ను వేదిస్తున్నట్లు అన్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాక పోతే రాత్రీ పగలూ మరీ కష్ట పడి చేసి అయినా కూడా సినిమాని రిలీజ్ డేట్ కు అందివ్వాలని డైరెక్టర్ వంశీ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news