బాలయ్య, చిరంజీవి సినిమాల వల్లే దిల్ రాజు కు దెబ్బ పడిందా?

-

దిల్ రాజు నిర్మాణం లో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  హీరో విజయ్ నటిచిన  వారీసు సినిమా  తమిళనాడు లో విడుదల అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా కోసం దిల్ రాజు 250 కోట్లు పెట్టి మరీ భారీ ఎత్తున తీశారు.ఇక  వారిసూ ను వారసుడును తెలుగు లో  ముందుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా తెర వెనుక మంత్రాంగం నడిచి 14 కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

సంక్రాంతి పండుగ బరిలో కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీరయ్య  సినిమా అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బాలయ్య బాబు సినిమా వీర సింహ రెడ్డి సినిమా లు ఉండటం వల్ల వెనక్కి వెళ్ళింది. తెలుగు లో మాత్రం వారసుడు సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్ళు సాధించడం లేదు.కాని  తమిళంలో మాత్రం వారిసు కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్కడ విజయ్ కు వున్న స్టామినా వల్ల సినిమా బాగా వసూళ్ళు వర్షం కురిపిస్తూ ఉంది.

జడ్జిమెంట్ లో తిరుగు లేని దిల్ రాజు కు తెలుగు లో పెద్ద దెబ్బ పడింది.తమిళంలో హిట్ అనిపించుకున్నా తెలుగులో మాత్రం ‘వారసుడు’ ఫ్లాప్ గా నిలిచి దిల్ రాజు అంచనా తప్పని నిరూపించింది. దీంతో తప్పెక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో దిల్ రాజు పడ్డాడట. బాలయ్య బాబు, చిరంజీవి సినిమాల మధ్య తాను నలిగి పోయినట్లు సన్నిహితుల వద్ద అంటున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news