మే 9కి మహర్షి వాయిదా.. స్టోరీ చెప్పేసిన దిల్ రాజు..!

-

మహేష్ బాబు 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా రిలీజ్ పై ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేశాడు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ముందు ఏప్రిల్ 5 ఉగాదికి రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 25న ఫిక్స్ చేశారు.

ఇక మళ్లీ ఇప్పుడు దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశామని అన్నారు. మే 9దే ఎందుకంటే అశ్వనిదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఆరోజునే రిలీజై పెద్ద సక్సెస్ అయ్యాయి. మా బ్యానర్ లో వచ్చిన పరుగు, ఆర్య, భద్ర కూడా మే నెలలో వచ్చి సక్సెస్ అయ్యాయని అన్నారు దిల్ రాజు.

అయితే మంచి కథ.. మంచి సినిమా మహేష్ కెరియర్ లో వన్ ఆద్ ది బెస్ట్ మూవీగా నిలిచే మహర్షిని త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ చేయడం ఎందుకని.. మే 9కి మహర్షిని తెస్తున్నాం అన్నారు. ఇక పనిలో పనిగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా థియేటర్ నుండి వచ్చే ప్రతి ప్రేక్షకుడు మనం ఎందుకు ఇలా ఆలోచించమని బయటకు వస్తామని హింట్ ఇచ్చాడు. అంటే పెద్ద కంపెనీ సి.ఈ.వో అయిన మహేష్ రైతుల గురించి సమాజం గురించి గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే దిల్ రాజు అలా అన్నారు. దిల్ రాజు చెప్పిన ఈ లీక్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news