‘సీతారామం’ హీరోయిన్‌గా పూజా హెగ్డే.. దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు..

-

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘సీతారామం’ ప్రజెంట్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమవుతోంది. ఈ సినిమా చూసి సినీప్రియులు ఫిదా అవుతున్నారు. సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన చిత్రం ‘సీతారామం’ అని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ ను వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేశారు.

ఇందులో రష్మిక మందన కీలక పాత్ర పోషించగా, హీరో, హీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ నటించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ మృణాళ్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. కాగా, ఈ సినిమా హీరోయిన్ పైన దర్శకుడు హను రాఘవపూడి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘సీతారామం’ సినిమాలో తొలుత హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను అనుకున్నానని తెలిపారు. అయితే, పూజా హెగ్డేకున్న స్టార్ డమ్ వల్ల పాత్ర హైలైట్ అవుతుందో కాదోనని అనుమానపడ్డానని చెప్పాడు.

ఇక ఆ తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్, స్వప్నల సూచన మేరకు మృణాళ్ ఠాకూర్ కోసం ముంబై వెళ్లినట్లు చెప్పాడు దర్శకుడు హను..

మృణాళ్ ఠాకూర్ నటించిన ‘సూపర్ 30’ సినిమాతో పాటు మరో చిత్రం చూసి తను ఫిదా అయ్యానని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు. హిందీ ‘జెర్సీ’ మూవీ షూటింగ్ లో ఉన్నపుడు తాను ‘సీతారామం’ స్టోరి చెప్పానని, అలా మృణాళ్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని హను వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news