ఆ డైరక్టర్ సలహాతో సాయి ధరం తేజ్.. సాయి తేజ్ అయ్యాడట..!

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా ఆరు ఫ్లాపులు అందుకున్నాడు. ఇక ఫైనల్ గా కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు సాయి తేజ్. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా మార్చుకున్నాడు. సక్సెస్ కోసం సెంటిమెంట్ లను నమ్ముకున్న మెగా హీరో న్యూమరాలజీని నమ్మాల్సి వచ్చింది. ఫైనల్ గా సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా మారాడు.

అయితే సాయి తేజ్ కు ఈ సూచన ఇచ్చింది మాత్రం డైరక్టర్ మారుతి అని తెలుస్తుంది. మెగా హీరోలతో మంచి సత్సంబంధాలున్న మారుతి వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్న సాయి ధరం తేజ్ కు ఈ సలహా ఇచ్చాడట. ఫైనల్ గా సాయి తేజ్ గా మారిన మెగా హీరో చిత్రలహరితో సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు చిత్రలహరి తర్వాత సాయి తేజ్ మారుతి డైరక్షన్ లోనే సినిమా చేస్తాడని తెలుస్తుంది.

శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో షాక్ తగలగా ఈసారి పక్కా హిట్టు కొట్టేలా కథ రాసుకుంటున్నాడట. సాయి తేజ్ తో చేయబోతున్న ఈ సినిమా మారుతి కెరియర్ కు చాలా ఇంపార్టెంట్ కానుంది. మరి ఇద్దరు కలిసి ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news