పూరి క్లారిటీ ఇచ్చేశాడు.. ఇస్మార్ట్ కాంబో రిపీట్

-

లైగర్ లాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత ఎట్టకేలకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా పై ఓ క్లారిటీ వచ్చేసింది. పూరి స్వయంగా తన నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ మెంట్ చేశాడు.

గతంలో ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ కెరీర్ లో పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ రామ్ ఇమేజ్ ను అమాంతం మార్చేసింది.

iSmart Shankar Movie Reviews and Update: Why You Must Watch This Film?

ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డబల్ ఇస్మార్ట్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించి పూరి టీమ్ స్పష్టత ఇచ్చింది. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించారు. అయితే రిలీజ్ అయిన మొదటి రోజే ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ పూరి జగన్నాథ్, చార్మికి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికి ఈ మూవీ నష్టాలు.. బయ్యర్ల ఆందోళనల రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు పూరి తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు లైఫ్ ఇచ్చిన పూరి కి ఛాన్స్ ఇచ్చాడు రామ్.

పూరి రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ కాంబో రిపీట్ కాబోతోంది అని చిన్న వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. క్లారిటీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి దిమాక్ కరాబ్ స్ట్రైక్స్ ఉండబోతుందను ప్రకటించాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్.. కొనసాగింపుగా ఉంటుందా లేదా కంప్లీట్ గా కొత్త కథతో మూవీ రానుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మీనే నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news