బండి సంజయ్: ఒక్క రాష్ట్రంలో గెలవగానే రెచ్చిపోవద్దు… 18 రాష్ట్రాల్లో మేమే అధికారంలో ఉన్నాం !

-

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఘనవిజయాన్ని అందుకుంది. దీనితో సౌత్ లో తెలంగాణ రాష్ట్ర నేతలు ఇదే సమయంగా భావించి బీజేపీ పని ఇక అయిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్ లు మరియు విమర్శలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును మరియు బీజేపీ ఓటమిని స్వాగతిస్తున్నాము, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాల్సిందే. కానీ కర్ణాటకలో గెలిచినంత మాత్రాన బీజేపీ ఎక్కడా తగ్గలేదన్నారు. అంతే కాకుండా ఓటమి వచ్చినా బీజేపీ ఓటు బ్యాంక్ చెక్కుచెదరలేదు అని సమాధానమిచ్చారు. ఓడిపోయినా ఒక్క కర్ణాటకలో మాత్రమే.. ఇంకా దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్న విషయం విమర్శలు చేసేవాళ్ళు గుర్తించుకోవాలి అంటూ చమత్కరించారు.

కేవలం ఒక రాష్ట్రంలో గెలిచినందుకే ఈ రేంజ్ లో రెచ్చిపోవడం కరెక్ట్ కాదు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇంకా పుంజుకుంటుంది అంటూ బీజేపీ ఇతర పార్టీపలపై రెచ్చిపోయి మాట్లాడారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news