ఆ వెబ్ సిరీస్ కోసం అనసూయ ప్రస్తుత పారితోషకం ఎంతో తెలుసా..?

-

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మాట తీరుతో.. అందచందాలతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటున్న ఈమె జబర్దస్త్ యాంకర్ గా మరింత పేరు సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే వెండితెరపై అవకాశాలను అందుకుంటూ పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది అనసూయ. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా క్రిష్ దర్శకత్వంలో అనసూయ నటిస్తున్న వెబ్ సిరీస్ కన్యాశుల్కం.

ఈ సిరీస్ లో నటించడానికి దర్శకుడు సలహా మేరకు అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పింది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా జబర్దస్త్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న అనసూయ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాల్ షీట్ కోసం ఎంత తీసుకుంటుంది అనేది వైరల్ గా మారింది. అసలు విషయంలోకెళితే ప్రస్తుతం అనసూయ ఒక్కొక్క కాల్ షీట్ కోసం రూ.2 లక్షల పారితోషకం తీసుకుంటుందట. దీన్ని బట్టి చూస్తే ఆమె సినిమాలలో ఏ రేంజ్ లో పారితోషకం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ ద్వారా అనసూయ భారీగానే సంపాదించబోతోంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ మా లో ప్రసారమైన ఒక కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించిన అనసూయ ఒక ఎపిసోడ్ కోసం అక్కడ రూ.4 లక్షల పారితోషకం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రేంజ్ను బట్టి ఈమెకి ఇప్పుడు వెబ్ సిరీస్లో ఈ రేంజ్ లో పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయిన్ రేంజ్ లో పారితోషకం తీసుకోబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news