అందరూ ఉండి కూడా అనాథని అంటున్న జబర్దస్త్ కొత్త యాంకర్..!

-

జబర్దస్త్ షో లో నవ్వులు పూయించే కమెడియన్ల గురించి.. తెర వెనుక వారి కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యరావు జీవితంలో కూడా అనేక కష్టాలు ఉన్నాయి. అవి హృదయాన్ని కలచి వేస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే గత తొమ్మిది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ను మెప్పిస్తున్న జబర్దస్త్ షో కి పదుల సంఖ్యలో హాస్యనటులు వస్తున్నారు. అందులో యాంకర్లు, జడ్జిలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోని కొత్తగా జబర్దస్త్ కి యాంకర్ గా వచ్చిన సౌమ్యరావు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

అంతేకాదు సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ లో సందడి చేసిన సౌమ్యరావు ఇప్పుడు మూడవ ఎపిసోడ్కి కూడా సిద్ధం అవుతోంది. ఆమెకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఇందులో ఆమె తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టింది . తాను అందరూ ఉండి కూడా అనాథనని తెలిపి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈమె కష్టాలు చూసి ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కి పోయింది.

ఇటీవల ఈటీవీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సౌమ్యరావు పాల్గొనింది . ఆ షో లో యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ .. మీ గురించి ఏదైనా చెప్పండి అని అడగ్గా.. తాను తన లైఫ్ గురించి చెప్పింది.. సౌమ్య రావు మాట్లాడుతూ..” నా లైఫ్ గురించి చెప్పను .. నాకు అమ్మ లేదు.. నాన్న ఉండి కూడా లేడు.. ప్రస్తుతం నేను ఒక అనాథని.. నాకు ఎవరూ లేరు.. ఇక్కడ ఉన్న వారందరికీ అమ్మనో.. నాన్ననో.. బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు . కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను” అంటూ కన్నీళ్లు పెట్టుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది సౌమ్యరావు. అందంగా నాజూగ్గా తన అందంతో యువతను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. జీవితంలో ఇలాంటి విషాద ఛాయలు ఉన్నాయని తెలిసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news