తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన సీరియల్ ఏంటో తెలుసా..?

-

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ నటుడు సముద్రఖని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా తమిళంలో వచ్చిన వినోదయ సీతం సినిమాను రీమేక్ చేసి తెలుగులో బ్రో సినిమా పేరిట రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై భారీ స్పందన సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , సాయి ధరంతేజ్ కలిసిన నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ క్రమంలోనే సముద్రఖనికి మంచి మార్కులు లభించాయని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈయనకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అలవైకుంటపురంలో మూవీ లో తనదైన శైలిలో అద్భుతమైన పాత్ర చేసి మెప్పించిన ఈయన తాజాగా విడుదలైన విమానం సినిమాలో కూడా ఎమోషనల్ పర్ఫామెన్స్ చేశారు. ఇక సముద్రఖని కేవలం సినిమాల దర్శకుడు , నటుడు మాత్రమే కాదు అద్భుతమైన సీరియల్ దర్శకుడు కూడా.. బ్లాక్ బస్టర్ సీరియల్ పిన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక ఈ సీరియల్ లో నటించింది. అందులో ఆమె ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించింది. సుమారుగా 3000 ఎపిసోడ్స్తో భారీ హిట్టుగా నిలిచిన ఈ సీరియల్ కి సముద్రఖని దర్శకత్వం వహించారు.

మొదటి భాగం పిన్ని కాగా రెండో భాగం ఝాన్సీ.. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సీరియల్ కి సముద్రఖని దర్శకత్వం వహించారని బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. అయితే తాజాగా ఈ విషయాలు బయటకు రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే సముద్రఖని రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ కాంబినేషన్లో వచ్చిన శంభో శివశంభో కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ కాకపోయినా సరే మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు బ్రో సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు సముద్రఖని.

Read more RELATED
Recommended to you

Latest news