కొత్త సంవత్సరం పేరు చెప్పకు, నాటకాలు వద్దు , పూరీ ఘాటు కామెంట్స్!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ వేద్దామనుకున్న పూరీ జగన్నాథ్ కు నిరాశే ఎదురైంది.

కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న  పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‏గా మారారు. సినిమాలు లేక ఖాళీగా ఉన్న పూరీ తన యూట్యూబ్ ఛానల్ పూరి మ్యూజిక్స్ కొన్ని అంశాలు పంచుకుంటున్నారు. దీని కోసం ఎదురుచూసే అభిమానుల కూడా ఉన్నారు.గతంలో  ఎన్నో ఆసక్తిరమైన విషయాలను చెప్పిన పూరి..ఇప్పుడు మనం తీసుకొనే కొత్త సంవత్సరం తీర్మానాలు గురించి సెటైరికల్ గా స్పందించాడు.

మనలో చాలా మంది కొత్త సంవత్సరం కొన్ని తీర్మానాలను రాసి పెట్టుకుంటామని మందు మానేద్దాం పేకాట ఆపేద్దామని అనుకుంటామని నీకు దమ్ముంటే ఈరోజే డిసెంబర్ 31 సెలబ్రేట్ చేయడం ఆపేయ్ అని పూరీ జగన్నాథ్ సంచలన కామెంట్లు చేశారు. అలాగే ఈరోజు ఆనందం కోసం ఏదైనా చేయి తప్ప రేపటి న్యూ ఇయర్ కోసం ఏమీ చేయొద్దని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. రేపు నా జీవితం బాగుంటుందని తాగొద్దని ఈ క్షణం బాగుంటుందని  తాగండి, అంతేగానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ నాటకాలు ఆడొద్దని కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

 

Read more RELATED
Recommended to you

Latest news