లైకా ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లో ఈడీ దాడులు..!

-

చెన్నైలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లోని కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు వివిధ బృందాలుగా విడిపోయి మరీ సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని డీ నగర్‌, అడయార్‌, కరపాక్క తదితర ప్రాంతాల్లోని లైకా కంపెనీకి చెందిన ఎనిమిది చోట్ల దాడులు జరుగుతున్నాయి. దాడుల వెనుక కారణాలు తెలియరాలేదు.

అయితే, అక్రమ నగదు బదిలీపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపినట్లుగా సమాచారం. తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కారణాలు తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

లైకా సంస్థ ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌-2 చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా.. ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌, జయం రవి, త్రిష, కార్తీ, ఐశ్వర్య మీనన్‌, శోభిత ధూళిపాళ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీఎస్​1కు సీక్వెల్​గా వచ్చిన ఈ చిత్రం కూడా మెరుగైన వసూళ్లే రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news