స్టూడెంట్ అలర్ట్: ఇంటర్ ఫెయిల్ అయ్యారా.. ఈ రోజు ఆఖరు తేదీ !

-

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఫెయిల్ అయినా విద్యార్థులకు ఈ రోజు చాలా కీలకమని తెలుస్తోంది. ఈ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను తగిన ఫీజును చెల్లించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవలెను. ఈ రోజుతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్, ఒకేషనల్, రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకునే విద్యార్థులకు చివరి తేదీగా విద్యాశాఖ ప్రకటించింది. ఇక ఎప్పటిలాగా ఈసారి తేదీని పొడిగించే విషయంపై ఇంకా క్లారిటీ లేదని స్పష్టం చేసింది.

ఇక అప్లై చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ వెబ్ సైట్: tsbie.cgg.gov.in ను సందర్శించి అందులో సర్వీసెస్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఫీజులు చెల్లించి పరీక్షలకు సిద్ధం కండి.

Read more RELATED
Recommended to you

Latest news