ప్రతిసారి డ్రామాలు పనికిరావు.. ఇక సమంత ముగిసింది.. నిర్మాత చిట్టిబాబు

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ నిర్మాత చిట్టిబాబు సమంత వైరల్ కామెంట్స్ చేశారు.

శకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత అనారోగ్యంతో బాధపడుతూనే కనిపించారు. మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకుంటూ జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నానని తెలిపారు. అలాగే డబ్బింగ్ చెప్పే సమయంలో గొంతు సైతం తనకి సరిగా పనిచేయలేదని తెలిపారు. కాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ నిర్మాత చిట్టిబాబు అదంతా డ్రామా అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రతిసారి డ్రామాలు వర్కవుట్‌ కాదంటూ మండిపడ్డాడు.

Samantha Ruth Prabhu reveals about her health issue- Myositis

ఈ విషయంపై మాట్లాడిన చిట్టిబాబు.. ‘విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటం సాంగ్‌ చేసింది. తన బతుకుదెరువు కోసం ఆమె నటించింది. హీరోయిన్‌ స్థాయి నుంచి పడిపోయాక తన చేతికి వచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లింది. అయినా హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ ముగిసిపోయింది.. గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్లడమే! మళ్లీ ఆమెకు స్టార్‌డమ్‌ రాదు. మొన్న యశోద సినిమా సమయంలో ఏడ్చేసి ఆ సినిమాను సక్సెస్‌ చేసుకోవాలనుకుంది.. ఇప్పుడేమో.. నేను చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకీ డ్రామాలు? ప్రతిసారి సెంటిమెంట్‌ వర్కవుట్‌ కాదు. కథ, పర్ఫామెన్స్‌ నచ్చితే చూస్తారు. అంతే కానీ అయ్యో పాపం, ఆఖరి కోరిక అన్నట్లుగా మాట్లాడుతోంది అని ఎవరూ చూడరు. ఇవన్నీ పిచ్చివేషాలు. ప్రతిసారి సమంత సెంటిమెంట్‌ డ్రామా క్రియేట్‌ చేస్తోంది. అయినా హీరోయిన్‌ స్థాయి నుంచి కిందకు పడిపోయిన అమ్మాయి శాకుంతలం చిత్రానికి ఎలా సెట్టయిందనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాపై నాకేమాత్రం ఆసక్తి లేదు..” అంటూ వైరల్ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news