Mahesh Babu: బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్స్..‘సర్కారు వారి పాట’పై మహేశ్ ఫ్యాన్స్ హోప్స్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను, సినీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమా డెఫినెట్ గా సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని మహేశ్ -కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ఆ తర్వాత కొవిడ్ ప్రభావం ఇతర కారణాల రిత్యా ఆయన నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సంగతులు పక్కనబెడితే..సమ్మర్ బ్లాక్ బాస్టర్ గా ఈ మూవీ తప్పక నిలుస్తుందని దర్శకులు పరశురామ్ చెప్తున్నారు.

‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ బాబు నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తు్న్నారు. పొడవాటి జుట్టు , మెడపై రూపాయి పచ్చబొట్టులో యంగ్ లుక్ లో మహేశ్ అదరగొడుతున్నాడు. ఇక ఈ సినిమాతో మహేశ్ వరుస చిత్రాల విజయ పరంపరను కొనసాగించనున్నారు.

ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ‘భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల తర్వాత ‘సర్కారు వారి పాట’ పిక్చర్ రాబోతున్నది. ఈ సినిమా తర్వాత మహేశ్ తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 ఫిల్మ్ చేయనున్నారు. ఆ తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ పిక్చర్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news