అప్పుడే ఓటీటీలోకి ఐశ్వర్యా రాజేశ్ ‘ఫర్హానా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

ఐశ్వర్యా రాజేశ్.. ఈ తెలుగు బ్యూటీ టాలీవుడ్ కంటే తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ వంటి సినిమాలతో అలరించింది. ఇటీవల ఈ భామ ఫర్హానా అనే సినిమాతో సందడి చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజై అనూహ్య విజయం సాధించింది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్ కీలకపాత్ర పోషించాడు.

రిలీజ్ కు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ముస్లింల నుంచి పలు విమర్శలు ఎదుర్కొంది. తమను తప్పుగా చూపించారని ఈ సినిమాపై కొంత మంది పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. అయితే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఉత్సాహంగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు ఓటీటీ డేట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను సోనీ లివ్ సంస్థ దక్కించుకుందట. జూన్ 16 నుంచి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news