ఇంక ఎవరికోసం ఆర్ ఆర్ ఆర్ మొదలు పెట్టాలి ..?

-

రాజమౌళి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎంతో శక్తి వంతమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టార్ హీరోలకి జంటగా ఆలియా భట్..ఓలియా మోరెస్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూణె దగ్గర్లో కోట్ల బడ్జెట్ తో సెట్ వేసి చిత్రీకరణ జరపాలనుకున్న సమయంలో కరోనా తో లాక్ డౌన్ విధించారు. దాంతో చిత్ర బృందం వచ్చి ఇంట్లో పడ్డారు. ఆ తర్వాత నుంచి కరోనా విజృంభన తెలిసిందే.

 

ఇటీవల చిత్ర పరిశ్రమలో అనుమతులు వచ్చి అన్ని సినిమాల షూటింగ్స్ మళ్ళీ ప్రారంభమవుతాయన్న ఊపు కనిపించింది. కాని ఆ ఊపు ఒక్క బండ్ల గణేష్ కరోనా పాజిటివ్ రాగానే ఆగిపోయింది. పేరుకే సినిమాలు ప్రారంభం అవుతున్నాయన్న టాక్ వస్తుంది గాని కంటిన్యూగా చిత్రీకరణ జరపడానికి మాత్రం దర్శక నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. మొత్తం యూనిట్ లో 50 మందికే అనుమతి ఉన్నప్పటి ఈ 50 మంది ఎక్కడెక్కడి నుంచి వస్తారో… ఎవరెవరిని అంటుకొని ముట్టుకొని వస్తారో అన్న భయాంధోళనలే మేకర్స్ ని బాగా బెంబేలెత్తిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కూడా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కాని ఇక్కడున్న స్టార్ హీరోలే ముందుకు రావడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం. కనీసం డూప్ లని పెట్టి మాక్ షూట్ చేద్దమంటేనే గత 10 రోజులుగా రాజమౌళి కి పోలీస్ వాళ్ళ దగ్గర్నుంచి పర్మిషన్స్ రావడం లేదు. దాంతో డైరెక్ట్ గా రాం చరణ్, ఎన్.టి.ఆర్ లతో కొన్ని సన్నివేశాలనైనా పూర్తి చేద్దామనుకుంటే ఈ ఇద్దరు సున్నితంగా ఇప్పుడే వద్దని కరోనా మొత్తం శాంతించాక మొదలు పెడదామని రాజమౌళికి చెప్పారట. దీంతో నిర్మాత దానయ్య విపరీతంగా టెన్షన్ పడుతున్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news