సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి సర్కారు వారి పాట …?

-

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా పారంభమైంది. గీత గోవిందం ఫేం పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సర్కారు వారి పాట అన్న టైటిల్ ని నిర్ణయించిన చిత్ర బృందం రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టి రికార్డ్ సాధించింది.

 

ఇక ఇప్పటికే మహేష్ బాబు సినిమా వచ్చి 6 నెలలు కావస్తుంది. దాంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదీ కాక మహేష్ లుక్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను విపరీతమైన క్రేజ్ పెంచుతోంది. దాంతో ఈ సినిమా నుండి మళ్ళీ తాజా అప్‌డేట్ కోసం చూస్తున్నారు.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సర్కారు వారి పాట వచ్చే సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు మహేష్ బృందం ప్లాన్స్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news