బాక్సాఫీస్ వద్ద గదర్-2 ఊచకోత.. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన సన్నీ డియోల్

-

బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌, అమీషా పటేల్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన గదర్-2 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2001లో వచ్చిన ‘గదర్-ఏక్‌ ప్రేమ్‌ కథా‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో .. రెండు దశాబ్దాల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన గదర్‌-2 అంతకు మించి వసూళ్లు రాబడుతోంది.

1971 నాటి భారత్-పాక్ యుద్ధ సమయంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గ‌త‌ శుక్ర‌వారం విడుదలై పాజిటీవ్‌ రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకు మొత్తం రూ.305.13 కోట్లు కలెక్షన్స్‌ వచ్చినట్లు సినిమా మార్కెట్‌ వర్గాల సమాచారం. రానున్న వారం రోజుల్లో మరో కొత్త రికార్డును కూడా బద్దలు కొట్టనుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అనిల్ శర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. కమల్ ముఖుత్‌తో కలిసి అనిల్ శర్మ సంయుక్తంగా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news