మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్… మూవీ ఫైనల్…!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు… సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు. అందరిలో నెలకొన్న ఆసక్తి ఇదే. దాదాపు మూడు నాలుగు కథలు అతను విన్నాడు. అలాగే వంశీ పైడపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా ఒక కథ విని దాన్ని లైన్ లో పెట్టాడు. కాని ఆ కథ మహేష్ కి నచ్చలేదు. దీనితో కథను వద్దని మార్పులు చెయ్యాలని సూచించాడు. దీనికి వంశీ కష్టపడినా… మారిస్తే బాగోదని వదిలేసాడు ఆ కథను.

ప్రస్తుతం మహేష్ బాబు ఏ సినిమా చేస్తున్నాడు అనేది స్పష్టత వచ్చింది. వంశీ తర్వాత గీత గోవిందం దర్శకుడు… పరుశారం దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు అందరూ అనుకున్న విధంగానే మహేష్ బాబు ఆ సినిమాను ఫైనల్ చేసాడు. కరోనా వైరస్ తర్వాత ఆ సినిమా చేయనున్నాడు మహేష్ బాబు. వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు… అడ్వాన్సు కూడా తీసుకున్నాడని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి. హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా 14 రీల్స్ ప్లస్ సంస్థలతో పాటు మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news