నిర్భయ హంతకులకి సమాధి కంట్టించాలా ..ఏం మాట్లాడుతున్నారు .. కంగనాని ఏకిపారేస్తున్న నెటిజన్స్ ..!

-

బాలీవుడ్ ఆటం బాంబ్ కంగన రనౌత్ ఒక సామాన్య యువతి నుండి బాలీవుడ్ లో స్టార్ హీరోలకి ధీటుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వైనం అందరికి తెలిసిందే. అంతేకాదు ఒక స్టార్ హీరోకున్న మార్కెట్ ని కంగన సంపాదించుకుంది. బాలీవుడ్ లో లేడి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకున్న కంగన ఫీమేయిల్ ఓరియొంటెడ్ సినిమాలు చేయాలన్న మణికర్ణిక లాంటి సాహసోపేతమైన సినిమాలో నటించాలన్న కంగన తర్వాతే. ఇక పొరపాటు మాట్లాడినా తప్పుగా ప్రవర్తించినా ఎదురుగా ఉన్నది ఎవరి కూడా లెక్క చేయకుండా చెంపమీద కొట్టినట్టు మాట్లాడి సంధానం చెప్పడం, కౌంటర్ ఇవ్వడం లో కంగన డేర్ మామూలుగా ఉండదు.

 

ఇక తాజాగా దిల్లీ నిర్భయ దోషులకు సంబంధించి కంగన చేసిన కామెంట్స్ కి అందరు అవాక్కవుతునారు. ఇది ఎలా సాధ్యం అని షాక్ లో ఉన్నారు. రీసెంట్ గా నిర్భయ దోషులను ఉరి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఉరి తీసిన నలుగురు దోషుల పేర్లతో స్మారకాలు నిర్మించాలని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడే వారిని.. యాసిడ్ దాడులు చేసే మృగాళ్ళని ఈ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని ఈ స్మారకాల ద్వారా తెలియజేయాలని కంగన షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే దోషులకు సంబంధించిన స్మారకాలు నిర్మించాలని కంగన చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

అయితే ఇలా కంగన చేసిన ఈ కామెంట్స్ కి నెటిజన్స్ రివర్స్ లో కంగన ని ఏకిపారేస్తున్నారు. 2012 డిసెంబర్ 16న బస్సులో కొంత మంది దుర్మార్గులు నిర్భయ పై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ దారుణమైన ఘటన భారత దేశం మొత్తం సంచలనం సృష్టించింది. దీనిపై యావత్ భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణమైన దోషులకు ఉరిశిక్ష వేయాలని నిరసన తెలిపిన వాళ్ళలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. అంతేకాదు దుర్మార్గులకు స్మారకం కడితే వీడు దుర్మార్గుడు అని తెలుస్తుంది అని కంగన ఇలా వ్యాఖ్యలు చేసినప్పటికి.. ఈ వ్యాఖ్యలు కొంతమంది సమర్ధించడం లేదు. తిరిగి కంగన మీద మీరు చేస్తున్న కామెంట్స్ ఎంతమాత్రం సరైనవి కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news