బుట్ట బొమ్మకు దక్కిన అరుదైన గౌరవం..ఆనందంలో అభిమానులు

-

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే..ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. టాలీవుడ్ , కోలీవుడ్, బాలీవుడ్..ఇలా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సుందరి..ఇప్పుడూ ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవల ఈ భామ నటించిన ‘రాధేశ్యామ్, ‘బీస్ట్’, ‘ఆచార్య’ సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో ఈ అమ్మడు నటించిన మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే..తాజాగా పూజా హెగ్డేకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వం తరఫున ఈ ఏడాది కేన్స్ లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఈ హీరోయిన్ భారత్ తరఫున ప్రతినిధిగా వెళ్లనుంది.

ఈ నెల 17 నుంచి 28 వరకు జరిగే వేడుకల్లో భారత్ తరఫున పూజా హెగ్డే హాజరు కానున్నట్లు భారత ప్రభుత్వంలో ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ విషయం తెలుసుకుని పూజా హెగ్డే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశాన్ని రిప్రెజెంట్ చేసే చక్కటి అవకాశం తమ అభిమాన హీరోయిన్ కి దక్కిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news