గుణ‌శేఖ‌ర్ కూడా స‌ర్‌ప్రైజ్ ఇస్తాడ‌ట‌!

-

గుణ‌శేఖ‌ర్ రూపొందించిన `రుద్ర‌మ‌దేవి` విడుద‌లై స‌రిగ్గా నేటికి ఐదేళ్లు. అనుష్క, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మంచి విజ‌యాన్న సాధించ‌డ‌మే కాకుండా ద‌క్షిణాదిలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.  ఈ మూవీ విడుద‌లై ఐదేళ్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ఇదే రోజు ఆడియ‌న్స్‌కి ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు. `రుద్ర‌మ‌దేవి` త‌రువాత మైథ‌లాజీక‌ల్ డ్రామా నేప‌థ్యంలో `హిర‌ణ్య‌క‌శ్యప` చిత్రాన్ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే.

గ‌త ఐదేళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అమెరికాలో జ‌రుగుతోంది. హాలీవుడ్ చిత్రాల త‌ర‌హాలో సాంకేతికంగా ఉన్న‌తంగా వుండేలా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వ‌ర్క్ పూర్త‌యింద‌ట‌. ఈ విష‌యాన్నే గుణ‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. ప్ర‌పంచం మొత్తం క‌రోనా మ‌హ‌మ్మారి విళ‌య‌తాండ‌వం చేస్తున్న‌ప్ప‌టికి `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌` ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్తయింది. అయితే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్న నేప‌థ్యంలో దానికి ఇంకా టైమ్ ప‌డుతుంది. కాబ‌ట్టి ఆలోపు మ‌రో చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌నుకుంటున్నాను. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ని ఈ రోజు రాత్రి 7:11 నిమిషాల‌కు ఇవ్వ‌బోతున్నాను` అని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇంత‌కీ గుణ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించ‌బోతున్న ప్రాజెక్ట్ ఏంటీ? ఎవ‌రితో అన్న‌ది తెలియాంటే రాత్రి 7:30 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news