కొత్త వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హేమ..అందుకే సినిమాలకు దూరం..!!

-

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు కేవలం సినిమాలో షోలపై మాత్రమే ఆధారపడకుండా వేరే వ్యాపారాలు కూడా చేస్తూ డబ్బు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు మొదలు చిన్నచిన్న సెలెబ్రెటీల వరకు చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నటి హేమ కూడా వచ్చి చేరింది. ఆమె మొదలుపెట్టిన కొత్త వ్యాపారం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె గత కొంతకాలం నుంచి సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు . తాజాగా అర్పి మణికొండలో ప్రారంభించిన చేపల పులుసు అవుట్లెట్ ఓపెనింగ్ కి నటి హేమా కూడా హాజరయింది. ఈ సందర్భంగా కొంతమంది ఆమెను ఎందుకు ఈ మధ్య సినిమాలలో నటించడం లేదు మేడం అని ప్రశ్నించగా.. అందుకు హేమ తాను కూడా కొత్త బిజినెస్ ప్రారంభించాలని.. దానిలో సంపాదన ఎక్కువయి సుఖపడడం అలవాటైపోయిందని.. అందుకే కష్టపడాలని అనిపించడం లేదు అంటూ సెటైరికల్ గా సమాధానం ఇచ్చింది..

దాంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.. అంతలా ఆదాయం వచ్చే బిజినెస్ ఏంటి అబ్బా అని ఆలోచించారు.. అంతేకాక ఏ వ్యాపారం మేడం అని హేమాను ప్రశ్నించగా ఆమె మరో ఇంటర్వ్యూలో చెబుతాను అంటూ సమాధానం దాటవేసింది.. ఇకపోతే కిరాక్ ఆర్పి మంచి కోరే వారిలో తాను ముందు వరుసలో ఉంటానని హేమ చెప్పుకొచ్చింది… హేమ అన్న మాటలు వింటే ఆమె వెటకారంగా అన్నదా లేక నిజంగానే ఆమె ఏదైనా వ్యాపారం లోకి అడుగుపెట్టిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news