హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కారు టైర్లలో గాలి తీసిన అభిమానులు

-

తెలుగు సినీ పరిశ్రమలోని హీరోయిన్ లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు.”శతమానం భవతి” వంటి విజయవంతమైన చిత్రంలో నటించి మెప్పించిన ఈ భామ ఇటీవల కోదాడ, సూర్యాపేటలో ఓ షాప్ ఓపెనింగ్ వేడుకకు హాజరైంది.అనుపమ ను చూసేందుకు వందలాది మంది గుమిగూడారు.ఆమె అందమైన చిరునవ్వుతో ప్రజలను పలకరించారు.స్థానికులు, అభిమానులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆమె ఆనంద క్షణాలను బంధించేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.ఈ క్రమంలో ఆమె మరింత సమయం అక్కడే ఉండాలని ఫ్యాన్స్ కోరారు.

 

అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లి పోయేందుకు సిద్ధమయ్యారు.దీంతో కొందరు ఆకతాయిలు ఆమె ప్రయాణించే కారు టైర్లలో గాలి తీశారు.అనంతరం షాపు నిర్వాహకులు ఆమెకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్ కు పంపించారు.ఇప్పుడు ఆమె వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఈ చేదు ఘటనతో అనుపమ ఒకింత షాక్ కు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news