రష్మిక మందన్నకి మొన్న ఎన్టీఆర్ ఈ రోజు సూర్య ఇచ్చిన షాక్ తో అల్లాడిపోతుందిగా పాపం ..!

-

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటి రష్మిక మందన్న ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో నటించిన ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు- రీసెంట్ గా వచ్చిన నితిన్ భీష్మ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. అయితే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి భీష్మలో నటించిన పాత్ర కి మాత్రం అంచి మార్కులు పడ్డాయి.

అయితే తనకు వచ్చిన అనూహ్యమైన క్రేజ్ తో రష్మిక మందన్నకు తమిళంలో కూడా ఆఫర్స్ బాగానే వచ్చాయి. కోలీవుడ్ లో వరుసగా కార్తీ- సూర్యలతో కలిసి నటించే ఛాన్స్ ని దక్కించుకుంది ఈ కన్నడ బ్యూటి. కార్తితో సుల్తాన్ సినిమా చేస్తుండగా సూర్యతో హరి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నని ఎంపిక చేసినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా తెలిసిన వార్తల ప్రకారం రష్మిక మందన్నకి దిమ్మ దిరిగే షాక్ తగిలింది. ఈ షాక్ ఇచ్చింది సూర్య అని తెలుస్తోంది.

హరి దర్శకత్వంలో సూర్య నటించే సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న కి బదులుగా మాళవిక మోహనన్ ని ఫైనల్ చేశారట. దీంతో విషయం తెలిసి రష్మిక మందన్న షాక్ కి గురైందట. సూర్య వంటి పెద్ద స్టార్ సినిమాలో ఛాన్స్ మిస్ కావడంతో కన్నడ బ్యూటీకి మైండ్ బ్లాంక్ అయిపోయిందట! త్రివిక్రమ్- ఎన్టీఆర్ సినిమాలో కూడా మొదట రష్మిక మందన్న పేరు వినిపించింది. ఆ తర్వాత పూజా హెగ్డేని ఫైనల్ చేయడంతో రష్మిక మందన్నకు పెద్ద ఝలక్ పడింది. ఎన్టీఆర్. ఆ తర్వాత సూర్య ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు ఇచ్చిన షాక్ కి రష్మిక మందన్న అల్లాడిపోతుందట పాపం.

Read more RELATED
Recommended to you

Latest news