లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు హైకోర్ట్ నోటీసులు

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా ఆర్జివి మొదలు పెట్టిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గొడవ ముదిరి పాకాన పడుతుంది. సినిమా పోస్టర్స్ తోనే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వర్మ ఈమధ్య రిలీజ్ చేసిన ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ తో తాను సినిమాను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో తెలియచెప్పాడు. అయితే ఈ సినిమా టిడిపి వ్యతిరేకంగా వైసిపి నేతలు వెనుక ఉండి చేయిస్తున్నారని వాదనలు వినిపించాయి.

తాజాగా ఈ విషయంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు టిడిపి ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ. హైకోర్ట్ విచారణ అనంతరం చిత్ర దర్శక నిర్మాతలతో పాటుగా సెన్సార్ టీం కు నోటీసులు అందించారు. నాలుగు వారాల్లో దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా ఆర్డర్స్ వచ్చాయి. అయితే దీనిపై డైరక్టర్ వర్మ ఇంకా స్పందించలేదు. టిడిపి వర్గాలు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ను ఆపేసే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నా ఎవరేం చేసినా సినిమా రిలీజ్ ను అడ్డుకోలేరని మొండిగా చెబుతున్నాడు వర్మ. మరి సినిమా రిలీజ్ ముందు ఇంత హంగామా చేస్తే ఆఫ్టర్ రిలీజ్ ఇంకెన్ని గొడవలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news